Ananya Panday డ్రగ్స్ వ్యవహారం.. చిక్కుల్లో లైగర్ సినిమా.. ఏం జరిగినా షూట్ డౌటే?

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత బాలీవుడ్ అంతా డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో అనన్య పాండే పేరు తెర మీదకు వచ్చింది. ఆమె ఇరుక్కోవడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా టీమ్ చిక్కుల్లో పడినట్టు కనిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే

ఎన్‌సిబి ఆఫీసులో అనన్య పాండే

ఎన్‌సిబి ఆఫీసులో అనన్య పాండే

నటి అనన్య పాండే, ఆమె తండ్రి చుంకీ పాండే గురువారం ఎన్‌సిబి కార్యాలయానికి వచ్చారు. అనన్యను ఎన్‌సిబి ప్రశ్నించడానికి పిలిచింది. నటి అనన్య పాండేను ప్రస్తుతం ఎన్‌సిబి కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో ఈ విచారణలు జరుగుతున్నాయి. ఈ ఉదయం, ఎన్‌సిబి అనన్య పాండేను తన కార్యాలయానికి విచారణ కోసం పిలిచింది, తర్వాత అనన్య తన తండ్రి చుంకీ పాండేతో కలిసి సాయంత్రం 4 గంటలకు ఎన్‌సిబి కార్యాలయానికి చేరుకుంది.

ఫోన్, లాప్ టాప్ సీజ్

ఫోన్, లాప్ టాప్ సీజ్

ఎన్‌సిబి ప్రాంతీయ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆమెను స్వయంగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యోరో ఇప్పటికే అనన్య ఫోన్ మరియు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుంది. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితుడి చాట్‌లో చంకీ పాండే కుమార్తె అనన్య పేరు వచ్చిందని, అందుకే ఆమెను విచారణకు పిలిచామని చెబుతున్నారు.

నిందితుల వాట్సాప్ చాట్

నిందితుల వాట్సాప్ చాట్

ఇంతలో, NCB అనన్య పాండేను పిలిపించడం వెనుక ఉన్న ఉద్దేశం ఆమె అనుమానితురాలు కాదని చెప్పింది. ఆమె కొన్ని విషయాలు ధృవీకరించాలని, అందుకే ముందస్తుగా మొబైల్‌ని ఎన్‌సిబి జప్తు చేసిందని అంటున్నారు. క్రూయిజ్ డ్రగ్స్ కేసు నిందితుల వాట్సాప్ చాట్ నుంచి అందిన సమాచారం తర్వాత, NCB నిన్న రాత్రి మరో 4 చోట్ల దాడి చేసింది ... అయితే ఈ రైడ్‌లో ఏమి దొరికిందో ఇంకా తెలియలేదు.

క్రూయిజ్ కేసులో

క్రూయిజ్ కేసులో

షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (23) మరియు మరికొంత మందిని అక్టోబర్ 3 న ముంబై తీరంలో గోవా వెళ్లే క్రూయిజ్ లో దాడి చేసి ఎన్‌సిబి అరెస్టు చేసింది. క్రూయిజ్ నుండి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ పేర్కొంది. సీనియర్ అధికారుల నేతృత్వంలోని ఎన్‌సిబి బృందం పేపర్‌వర్క్ కోసం మధ్యాహ్నం బాంద్రాలోని షారుఖ్ నివాసం 'మన్నత్' కు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్‌సిబి యొక్క మరొక బృందం బాంద్రాలోని నటి అనన్య పాండే ఇంటికి చేరుకుందని ఆయన చెప్పారు.

టెన్షన్ లో లైగర్

టెన్షన్ లో లైగర్

అయితే ఈ వ్యవహారం తరువాత ఇప్పుడు లైగర్ సినిమా యూనిట్ లో కొత్త టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు లైగర్ సినిమా యూనిట్ ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది. మైక్ టైసన్ తో పాటు ఈ షూట్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు అనన్య ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో పాటు ఆమె పేరు డ్రగ్స్ చాట్ లో కనిపించడంతో లైగర్ యూనిట్ టెన్షన్ పడుతోంది.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
చిక్కుకుంటే ఇబ్బందే

చిక్కుకుంటే ఇబ్బందే

ఒక వేళ అనన్య పాండే ఈ కేసులో చిక్కుకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఆమె ఈ వ్యవహారంలో చిక్కుకుంటే వీసా దొరక్కపోవచ్చు, దొరికినా ఆమె దేశం వదిలి వెళ్లడం అంటే పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X