Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రంగమ్మత్తకు అత్యుత్తమ ప్రశంస.. గాల్లో తేలిపోతున్న అనసూయ
మెగా పవర్స్టార్ రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలంతో అనసూయ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న గ్లామరస్ ఇమేజ్తోపాటు ఫెర్ఫార్మర్గా మంచి మార్కులు కొట్టేసింది అనసూయ. ఆ తర్వాత ఆమెను రంగమ్మత్తగా పిలవడం మొదలైంది. రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి పేరు, అభిమానులను సంపాదించిపెట్టిందనేది వాస్తవం. అయితే అలాంటి సంఘటన మరోసారి రుజువైంది.
తాజాగా లాక్డౌన్ సమయంలో #askAnasuya అంటూ అనసూయ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని మంచి కామెంట్ చేశాడు. అనసూయ గారు.. ఇప్పటి వరకు సినీ తారల్లో ఎవరినీ మా అమ్మ ఇష్టపడదు. కనీసం సినిమాలు కూడా ఎక్కువగా చూడదు. కాకపోతే రంగస్థలంలో రంగమ్మత్త రోల్లో మిమ్మల్ని చూసిన తర్వాత మీకు అభిమానిగా మారిపోయారు. అంతకంటే మీకు ఇంకా ఏమైనా ఉత్తమ ప్రశంస ఉంటుందా అనే విధంగా నెటిజన్ సందేశాన్ని పంపారు.
నెటిజన్ తన తల్లి గురించి తెలిపిన తర్వాత అనసూయ సంతోషంలో మునిగిపోయారు. హేయ్ అంటూ ఆనందంలో మునిగిపోయారు. మీ అమ్మగారికి నా ధన్యవాదాలు. గొప్ప అభిమానిని పొందినందుకు సంతోషంగా ఉంది అని అనసూయ ట్వీట్ చేశారు.
Heyyy!!! Give my regards to your mum❤️ https://t.co/e4KD1DoXmj
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 22, 2020
రంగస్థలం సినిమా తర్వాత అనసూయను మంచి పాత్రలు పలకరిస్తున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించే చిత్రంలోను, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్తో రూపొందిస్తున్న పుష్ప చిత్రంలో కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు.