Don't Miss!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- News డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?: ఉచితాలపై వెంకయ్య నాయుడు
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
గ్లామర్తో అదరగొట్టిన అనసూయ.. క్రేజీగా కథనం ట్రైలర్
ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కథనం'. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా, బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం ఈనెల 9న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ దిశలో భాగంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ట్రైలర్ ను సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు చేతుల మీదుగా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో లో నిర్మాత మాట్లాడుతూ ' సెలవులు కలిసొస్తుండడం, దగ్గర్లో సరైన మరో విడుదల తేదీ లభించక ఆగస్టు 9న వస్తున్నాం. పెద్ద చిత్రంతో పోటీ పడాలని కాదు' అని చెప్పారు.
అనసూయ మాట్లాడుతూ 'నాగార్జున గారు నా ఫెవరేట్ హీరో. ఆయన సినిమా పోస్టర్ (మన్మధుడు 2), నా సినిమా పోస్టర్ ఒకే రిలీజ్ టైమ్ కి చూస్తాననుకోలేదు. ఇది ఆయనతో పోటీ పడటం కాదు.. పైగా రెండు చిత్రాలు వేర్వేరు జానర్స్. డబ్బుతో ముడిపెట్టి పెద్ద సినిమా, చిన్న సినిమా అనడం సరికాదు. ప్రేక్షకులకు నచ్చిందే పెద్ద సినిమా, నచ్చకపోతే అది సినిమానే కాదు. ధనరాజ్ వల్లే ఈ చిత్రంలో నటించాను. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో పాట ఒక్కటే. రోషన్ చక్కని నేపథ్య సంగీతం అందించాడు. సతీష్ కెమెరా వర్క్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది. సినిమా మెప్పిస్తుందనే నమ్మకముంది' అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ 'మన్మధుడు 2 లాంటి పెద్ద సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రచారం చేస్తున్నాం. నైజాంలో దిల్ రాజు గారు విడుదల చేయడం హ్యాపీ. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అన్నాడు. ధనరాజ్ మాట్లాడుతూ 'భాగమతి తర్వాత మళ్ళీ అంత మంచి పాత్ర ఈ సినిమాలో లభించింది. సినిమా చూశాను.. మెప్పిస్తుందనే నమ్మకముంది' అన్నాడు.
నిర్మాతలు మాట్లాడుతూ :-సినిమా అనుకున్న విదంగా బాగా వచ్చింది ..మంచి డేట్ దొరకడం తో ఈ నెల 9 వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నాము ..అనసూయ నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది ..సెన్సార్ సభ్యులు సినిమా చూసి అబినందించడతో సినిమా పై మాకు మరింత నమ్మకం పెరిగిందని అన్నారు ..
నటీనటులు,
సాంకేతిక
వర్గం
అనసూయ
భరద్వాజ్,
అవసరాల
శ్రీనివాస్,
వెన్నెల
కిషోర్,
రణధీర్,
ధన్
రాజ్,
పృధ్వి,
సమీర్
తదితరులు
ఎడిటర్:
ఎస్.
బి.
ఉద్ధవ్,
మ్యూజిక్:
రోషన్
సాలూరి,
ఆర్ట్:
కె.వి
రమణ,
కో
డైరెక్టర్:
శ్రీనివాస్రావు,
ఫోటోగ్రఫీ:
సతీష్
ముత్యాల,
సమర్పకులు:
బేబీ
గాయత్రి
రెడ్డి,
ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్:
ఎమ్.
విజయ
చౌదరి,
నిర్మాతలు:
బి.
నరేంద్ర
రెడ్డి,
శర్మ
చుక్కా
కథ-స్క్రీన్
ప్లే-
దర్శకత్వం:
రాజేష్
నాదెండ్ల.