Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
యాంకర్ ఓంకార్కు కరోనావైరస్.. క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీని కరోనావైరస్ వెంటాడుతున్నది. ఇప్పటికే యాక్టర్లు ప్రభాకర్, హరికృష్ణ కోవిడ్ 19 బారిన పడటం బుల్లితెర వర్గాలను ఆందోళనకు గురిచేసింది. అయితే ఇంకా ఆ ఇద్దరికి కరోనావైరస్ సోకిందనే వార్త మరిచిపోకముందే తాజాగా దర్శకుడు, హోస్ట్, నటుడు, నిర్మాత ఓంకార్కు కరోనా సోకిందనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. కోద్ది రోజుల క్రితం ఇస్మార్ట్ జోడి అనే రియాలిటీ షోకు సంబంధించిన షూటింగ్లో ఓంకార్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనకు కరోనావైరస్ సోకిందనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తలపై కుటుంబ సభ్యులు స్పందించారు.
ఓంకార్ ఆర్యోగ్యపరంగా బాగానే ఉన్నారు. ఆయనకు కరోనా సోకిందనే వార్తల్లో వాస్తవం లేదు. ఈ వార్తల మధ్య వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొన్నారు. అయితే ఆయననకు కరోనా నెటిగివ్ అని రిపోర్టు వచ్చింది. ఓంకార్కు కరోనా అనే వార్తలను నమ్మెద్దు. అసత్య ప్రచారం ఆపాలని కుటుంబ సభ్యులు సూచించారు. ప్రస్తుతం ఓంకార్ ఆరోగ్యం గానే ఉంది. సోమవారం జూన్ 28 నుంచి రెగ్యులర్గా షూటింగులో పాల్గొంటారు. మీడియాలో అసత్య వార్తలను ప్రచురించవద్దని ఫ్యామిలి మెంబర్స్ వేడుకొన్నారు.
ఇదిలా ఉండగా, శనివారం మధ్యాహ్నం నుంచి ఓంకార్కు కరోనావైరస్ పాజిటివ్ వచ్చిందనే వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి. అయితే డైరెక్టర్, యాక్టర్ను కాంటాక్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో అంతా నిజమేనని భావించారు. అయితే పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.