Andhra Pradesh Exit Polls 2024: హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్.. నందమూరి వారసుడిని ఆపడం ఎవరితరం?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయనే విషయం ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడయ్యాయి. అందరి అంచనాలకు బిన్నంగా ఫలితాలు రాబోతున్నాయనే విషయం మరింత సెన్సేషనల్గా మారింది. పలు సంస్థలు భిన్నమైన అంచనాలను వెల్లడించడంతో జూన్ 4వ తేదీన వెల్లడయ్యే ఫలితాలు మరింత రసవత్తరంగా మారాయి. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హిందూపూర్ విజయంపై ఎగ్గిట్ పోల్స్ ఏం చెప్పాయంటే..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీకి కంచుకోటగా మారిన అనంతపురం జిల్లా నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. హిందూపూర్ నుంచి ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించారు. ఇక మూడోసారి విజయంపై ఆయన గురిపెట్టారు.

గత ఎన్నికల్లో 2019లో కూడా వైసీపీ ప్రభంజనం కొనసాగినప్పటికీ నందమూరి బాలకృష్ణ ఘన విజయం సాధించారు. హిందూపురం తన విజయానికి అడ్డగా మార్చారు. ఇక అదే ధీమాతో రాయలసీమ ప్రాంతంలో జగన్ ఆధిపత్యాన్ని ఎదురించి ఎమ్మెల్యేగా నిలబడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో జూన్ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది.

అయితే 2024 సంవత్సరంలో జరిగిన హిందూపూర్ ఎన్నికల్లో బాలయ్య మూడోసారి వైసీపీ నుంచి అత్యధికంగా పోటీని ఎదురించి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. నందమూరి వారసుడి విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











