Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
F3 రిలీజ్ డేట్పై అనిల్ రావిపూడి క్లారిటీ: కొత్తది అప్పుడే ప్రకటిస్తామని వెల్లడి
ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. ఊహించని విధంగా సూపర్ డూపర్ అయిన చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఇది ఘన విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్ను కూడా తీస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదలపై క్లారిటీ వచ్చింది.
అమేయ (అనన్య) క్యూట్ అండ్ గ్లామరస్ ఫొటోస్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)కు సీక్వెల్గా వస్తున్న చిత్రమే 'F3'. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అంతేకాదు, దాదాపుగా ఈ మూవీ చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. ఈ మధ్య కరోనా ప్రభావం పెరగడంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కోవిడ్ పాజిటివ్గా తేలడంతో షూటింగ్ను నిలిపేశారు. దీంతో సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. చాలా తెలుగు సినిమాల మాదిరిగానే దీన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు.
తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి.. 'కరోనా ప్రభావం రోజు రోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో 'F3' చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్పై త్వరలోనే ప్రకటన చేస్తాం' అని వెల్లడించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ షూట్ను వచ్చే నెల నుంచి పున: ప్రారంభించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సునీల్ కీలక పాత్రను పోషిస్తుండగా.. తెలుగు హీరోయిన్ అంజలి కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.