Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ ఉద్దేశంతోనే ఆమెను అంతలా బతిమిలాడా: అనిల్ రావిపూడి
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఇందులో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఈ సినిమాలో విజయశాంతిని తీసుకోవడంపై స్పందించారు.
దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకుంది లేడీ అమితాబ్ విజయశాంతి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ హైలైట్ కానుందని, విజయశాంతి- మహేష్ బాబు మధ్య షూట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల మన్ననలు పొందుతాయని తెలుస్తోంది.
అయితే తాజాగా మీడియా సమావేశంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కన్నా ముందే 'రాజా ది గ్రేట్' సినిమా కోసం విజయశాంతి గారిని కలిశానని చెప్పారు. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' లైన్ అనుకున్నానని.. అప్పుడే ఈ పాత్రకు విజయశాంతిగారి పేరును రాసేసుకున్నానని చెప్పారు. కథ మహేష్ బాబుకు చెప్పిన తర్వాత 'మేడమ్ను కలవబోతున్నా' అని ఆయనకు చెప్పగా.. 'ఆవిడ చేస్తారా' అని మహేష్ అడిగారని అనిల్ తెలిపాడు.
'నాకు ఆవిడతో పరిచయం ఉంది. వెళ్లి అడుగుతా' అని తాను మహేష్తో చెప్పి.. ఒకసారి కాదు, నాలుగైదు సార్లు వెళ్లి కలిసి విజయశాంతిని రిక్వెస్ట్ చేశానని అనిల్ రావిపూడి చెప్పాడు. ఈ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేనని అన్నాడు. 'మరో నటి ఎవ్వరు చేసినా కుదరదు.. వేరే వాళ్లు చేస్తే ఆ మ్యాజిక్ రాదు. అది మిస్సవకూడదనే ఉద్దేశంతోనే అంతలా బతిమిలాడా' అని అనిల్ రావిపూడి అన్నాడు.