Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వారిద్దరి మధ్య ఎవ్వరూ ఊహించని సీన్స్.. నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్
పదమూడేళ్ల తరువాత సీనియర్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ విజయశాంతి తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఓ వైపు భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు.. అనిల్ రావిపూడితో కలిసి చేస్తోన్న సరిలేరుపై మరింత హైప్ క్రియేట్ ఏర్పడింది. ఈ మూవీ రిలీజ్కు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచింది చిత్రయూనిట్.
భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్..
జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతోన్నట్లు ప్రకటించారు. తనకు కలిసి వచ్చిన ఆ స్టేడియంలో ఈ మూవీ ఈవెంట్ను చేయాలని మహేష్ భావించాడు. భరత్ అనేనేను ఈవెంట్ను అక్కడే జరపగా.. ఆనాడు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.అయితే ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి హాజరుకాబోతోన్నాడు.
కశ్మీర్లో అలా షూటింగ్..
ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఈ సినిమా షూట్ కోసం యూనిట్ మొత్తం కశ్మీర్ వెళ్లామని తెలిపాడు. ఆ సమయంలో ‘ఆర్టికల్ 370'ని రద్దు చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసిందని పేర్కొన్నాడు. తమ వ్యాన్లు అన్ని ఆగిపోయాయని, ఆర్మీ మేజర్లు చాలా సహాయం చేశారని తెలిపాడు.
మహేష్ బాబు తెలియడంతో..
మన డబ్బింగ్ సినిమాల్ని వారు చూస్తుంటారట... మహేశ్ బాబు అక్కడి వారికి తెలిసి ఉండటం వల్ల ఈ సినిమాకు కలిసి వచ్చిందని తెలిపాడు. అంత భద్రత ఎందుకు ఉందో అప్పుడు అర్థం కాలేదనీ, ఆ తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేశారని అన్నాడు.
ఎవ్వరూ ఊహించని విధంగా..
13 సంవత్సరాల తర్వాత విజయశాంతిగారు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నాడు. అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని కొనియాడాడు. మహేష్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని తెలిపాడు. అసలు వారిద్దరి కాంబినేషనే పెద్ద సెల్లింగ్ ఫ్యాక్టర్ అని అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్కి ప్రేక్షకుల నుండి విజిల్స్, క్లాప్స్ పడుతూనే ఉంటాయని, అవి లేనిచోట కన్నీళ్ళు పెడతారని అన్నాడు.