Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోగా మారిన మరో టాలీవుడ్ విలన్.. వాస్తవ సంఘటనలో మిస్టర్ రావణ..
మిస్టర్ ఇండియా టైటిల్ విజేత, టాలీవుడ్ విలన్ అనూప్ సింగ్ ఠాగూర్ టైటిల్ పాత్రలో "మిస్టర్ రావణ" అనే చిత్రం తెరమీదకు వస్తొంది. తెలుగు ,తమిళ కన్నడ, హిందీ భాషల్లొ రూపొందించే ఈ సినిమా ఇటీవల ముంబైలొని ప్రసిద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రారంభమైంది. కుందన ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అనూప్ సింగ్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్, నా క్యారక్టరైజెషన్ ను చాలా బాగా డిజైన్ చేశారు. నటుడిగా నా కెరీర్లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందన్నారు.
హీరోయిన్ సలోని మాట్లాడుతూ.. వాస్తవ సంఘటనల ఆధారంగా, నేపథ్యంగా మిస్టర్ సినిమా రూపొందుతున్నది. నా పాత్ర కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుందన్నారు.
దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ.. అనూప్ సింగ్ ఠాగూర్ విలన్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఈ సినిమాలొ కూడా ఆయన టైటిల్ పాత్రలొ నట విశ్వరూపాన్ని చూపిస్తారు. సలోని హీరొయిన్గా నటిస్తుందన్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్గా ఈ సినిమా ఉంటుందన్నారు.
నిర్మాత కుందన్ రాజ్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్తో నాలుగు భాషల్లో ఈ సినిమా తెరమీదకు రానుంది. అన్నీ భాషల నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలిపారు.ఈ చిత్రానికి ,కెమెరా: సురేందర్ రెడ్డి, సహనిర్మాత: ఇంద్రజిత్, నిర్మాణం : కుందన్ ఆర్ట్స్, కథ-కథనం-దర్శకత్వం : కుందన్ రాజ్.