Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విభిన్నమైన కథలతో రాబోతున్న మరో నలుగురు శిష్యులు.. సుకుమార్ న్యూ ప్లాన్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నేటితరం దర్శకులు నిజంగా ఆడియెన్స్ ఊహాలకందని రేంజ్ లో ఆలోచిస్తున్నారు. సినిమా అవుట్ పుట్ ఎలా ఉన్నా కూడా కథ సెలక్షన్ తోనే వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక సుకుమార్ ప్రొడక్షన్ నుంచి కూడా అలాంటి దర్శకులే ఎక్కువగా వస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల ఉప్పెన సినిమాతో ఏ స్థాయులో సక్సెస్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
శిష్యుల కోసమనే సుకుమార్ రైటింగ్స్ అని సపరేట్ గా ఒక ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసిన సుక్కు మొదట కుమారి 21F, దర్శకుడు అనే సినిమాలతో శిష్యులకు ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాల అనంతరం ఉప్పెన సినిమాతో బుచ్చిబాబును మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుక్కు శిష్యుడికి ఒక మంచి బూస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక నెక్స్ట్ ఈ దర్శకుడు మరో నలుగురిని ఇదే తరహాలో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సూర్య ప్రతాప్ అనే శిష్యుడితో 18 పేజెస్ అనే ఒక సినిమాను స్టార్ట్ చేయించాడు. అలాగే కార్తీక్ దండు అనే మరో సహాయక దర్శకుడు సాయి ధరమ్ తేజ్ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నాడు. విళ్ళతో పాటు మరో ఇద్దరు కూడా పవర్ఫుల్ కథలతో రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళందరిని కూడా సుకుమార్ సుకుమార్ రైటింగ్స్ ద్వారానే పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.