Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సాయి పల్లవి కొత్త మూవీ నిర్మాత ఆకస్మిక మృతి: సినిమా విడుదలకు ముందే విషాదం
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు. అదే సమయంలో మరికొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పలు రకాల సమస్యలతో మరణించారు. సెకెండ్ వేవ్లో ఈ పరిస్థితి మరింత ఎక్కవగా కనిపిస్తోంది. ఫలితంగా ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని అంతా భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్లో మరో దురదృష్టకర సంఘటన జరిగింది. తాజాగా ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు.
సాయి పల్లవి నటించిన 'అనుకోని అతిథి' అనే సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్కు ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. ఆయన కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వైద్యులు కూడా ఈ ప్రొడ్యూసర్ మరణాన్ని ధృవీకరించారని అంటున్నారు. ఈయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉండగా.. అన్నంరెడ్డి కృష్ణ కుమార్ సినిమా 'అనుకోని అతిథి' మే 28 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. అంతలోనే ఈ విషాదం జరిగింది.
వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం చిత్రం 'అథిరన్'.. సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను అన్నంరెడ్డి కృష్ణ కుమార్ తీసుకున్నారు. అయితే, అప్పుడు ఈ సినిమాను విడుదల చేయడం కుదరలేదు. దీంతో ఆహా ఓటీటీ సంస్థకు స్ట్రీమింగ్ హక్కులను అమ్మేశారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సమయంలోనే నిర్మాత మరణించడం షాక్కు గురి చేస్తోంది.