Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
బీహార్ అసెంబ్లీలో అనుపమ పరమేశ్వరన్ రచ్చ.. ఘాటుగా స్పందించిన తేజస్వి యాదవ్
ఆధార్ కార్డు, ఓటరు కార్డు, హాల్ టికెట్లపై ఇలా ఒకరి ఫోటోకు బదులుగా మరో ఫోటో రావడం చాలాసార్లు మన దృష్టికి వచ్చింది. ఇలాంటి తప్పులు దొర్లడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. తాజాగా బీహార్ విద్యాశాఖ నిర్వహించిన సెకండరీ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్, 2019 ఓ విద్యార్థి రిజల్ట్కు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వ్యవహారం బీహార్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య భారీ గొడవకు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
హృషికేష్ కుమార్ అనే విద్యార్థికి సంబంధించిన ఉర్దూ, సంసృతి, సైన్స్ పేపర్లకు సంబంధించిన ఫలితాల్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫోటో రావడం చర్చనీయాంశమైంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అలాంటి తప్పు దొర్లింది అని సెకండరీ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు.
కానీ ఈ వ్యవహారంపై రచ్చ అసెంబ్లీలో ఘాటుగానే సాగింది. సెకండరీ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్కు సంబంధించిన విషయంలో భారీగా కుంభకోణాలు, అక్రమాలు చోటుచేసుకొన్నాయి అని బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. పరీక్షల నిర్వాహకుల తీరును బీహార్ అసెంబ్లీ ప్రశ్నించింది. లోపాలతో పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పార పట్టింది. అక్రమాలు జరగకుండా వెకెన్సీలను నింపాలని సూచించారు.
తేజస్వీ యాదవ్ ఆరోపణలపై బీహార్ ప్రభుత్వం తరఫున జేడీయూ నేత గులాం ఘాస్ స్పందిస్తూ.. ఇలాంటి చిన్న తప్పులు జరగడం సాధారణం. అలాంటి భూతద్దంలో పెట్టి చూపకండి అని అన్నారు. లోపాలను గుర్తించి అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి తప్పు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రాష్ట్రస్థాయి బీహార్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాల్లో బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరుతో ఓ విద్యార్థి టాప్ ర్యాంకు సాధించడం చర్చనీయాంశమైంది.