Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ప్రియాంక రెడ్డి హత్య : మానవత్వం చచ్చిపోతోంది.. మహిళగా పుట్టడమే నేరమా?
డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని ఉరి తీయాలంటూ ముక్తకంఠంతో నినాదాలు చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులే కాదు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు ఇలా సమాజం అంతా ఒక్క తాటిపైకి వచ్చి.. నిందుతులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తుండగా అనుష్క, మంచు లక్ష్మీ వంటి వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
|
మానవత్వం చచ్చిపోతోంది..
నాకు మాటలు రావడం లేదు.. కానీ కచ్చితంగా ఇప్పుడిది చెప్పాలి.. మానవత్వం అనేది చచ్చిపోతోంది.. ప్రభుత్వాలు, పోలీసులు కాదిక్కడ మానవత్వమనేది లేకుండా పోతోంది. ఇలాంటి రాక్షసుల మూలానా ఎంతో మంది బలైవుతున్నారు.. ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
మహిళగా పుట్టడమే నేరమా
ప్రియాంక రెడ్డి ఘటనపై అనుష్క స్పందిస్తూ.. సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా? అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే... అవి కూడా సిగ్గుపడతాయని అన్నారు. అమాయకురాలైన ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి చంపేశారని... ఇది మొత్తం మానవాళిని కదిలించే విషాదకరమైన ఘటన అని చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి వెంటనే శిక్ష పడే విధంగా మనందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.
|
నా హృదయం ముక్కలైంది..
హైదరాబాద్లో జరిగిన సంఘటన విని నా హృదయం ముక్కలైంది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఇలాంటి వాటికి పూర్తిగా అంతమొందించాలంటే ఎన్నో మార్పులు రావాలి. ఇలాంటివెప్పుడు అంతమవుతాయి? అంటూ ప్రశ్నించింది.
Recommended Video
|
ఇదే సరైన సమయం
మనే దేశంలో చదువంటే కేవలం డిగ్రీలు, జాబ్ సంపాదించడమే.. జీవితాన్ని నేర్పడమే నిజమైన చదువని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం.. ట్రాఫిక్ రూల్స్, ఆడవారిని గౌరవించడం, ఎదుటివారికి మర్యాద ఇవ్వడం లాంటివి పిల్లలకు నేర్పాలి.. నా హృదయం నుంచి రక్తం కారుతోంది.. ప్రియాంక రెడ్డి వార్త విన్న తరువాత.. మార్పు అనేది కింది స్థాయి నుంచి రావాలి అంటూ ఆవేదన చెందింది.