Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అనుష్క శర్మపై విమర్శలు: భర్తతో కలిసి ఆ ఫోటోలో ఉండటమే కారణం!
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, విరాట్ కోహ్లి పెళ్లికి ముందు అనేక ట్రోల్స్ జరిగాయి. అనుష్క ఏదైనా మ్యాచ్కు హాజరైనపుడు ఇండియా ఓడిపోతే అంతా అనుష్కను ఆడిపోసుకునేవారు. నీ మాయలో పడి కోహ్లి సరిగా మ్యాచ్ ఆడలేకపోతున్నాడు అని విమర్శించేవారు. తర్వాత ఈ ఇద్దరూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా అనుష్క, విరాట్ మీద మరోసారి విమర్శలు వెళ్లువెత్తాయి. అందుకు కారణం... టీమిండియా అఫీషియల్ ఫోటోలో అనుష్క శర్మ దర్శనమివ్వడమే. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
లండన్లోని భారత హైకమిషన్ ఆహ్వానం మేరకు టీమ్ మొత్తం కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అనుష్క కూడా కోహ్లితో కలిసి అక్కడకు వెళ్లింది. ఇక్కడ టీమ్ అంతా కలిసి దిగిన ఫోటోను బీసీసీఐ ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ఆ ఫోటోలో అనుష్క ఉండటంతో విమర్శలు మొదలయ్యాయి.
టీమిండియా అఫీషియల్ పర్యటనలో అనుష్క ఉండటం ఏమిటి? ఆమె ఏమైనా జట్టులో సభ్యురాలా? లేక టీమిండియా వైస్ కెప్టెనా? అంటూ కొందరు మండి పడ్డారు. మరికొందరైతే ఇది క్రికెట్ టూర్ మాదిరిగా అనిపించడం లేదని, కోహ్లి-అనుష్క హనీమూన్ టూర్ లా ఉందంటూ ఘాటుగా విమర్శించారు.