Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుష్క కోసం 20కోట్లు ఖర్చు పెట్టి.. ఓటీటీ రిలీజ్ అంటే ఎలా?
బాహుబలి సినిమా అనంతరం వేగంగా సినిమాలు చేస్తుందని అనుకున్న అనుష్క శెట్టి.. ఆ తరువాత కూడా హీరోల మాదిరిగానే నెమ్మదిగా వర్క్ చేస్తోంది. ఒక సినిమా తరువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుంటోంది. కొడితే బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్న స్వీటీ బాగమతి తరువాత చాలా గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేసిన చిత్రం సైలెన్స్. తెలుగులో ఈ సినిమా నిశ్శబ్దం అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమా ఈ ఏడాది మొదటి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన సైలెన్స్ సినిమా నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఇంకా వాయిదా పడుతూనే ఉంది. కరోనా లాక్ డౌన్ వల్ల మరో రెండు నెలలు థియేటర్స్ క్లోజ్ కాబట్టి వెయిట్ చేయక తప్పదు. రెండు నెలల తరువాత కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే ఈ సినిమాను డిజిటల్ వరల్డ్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది.
కానీ అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటి ఇచ్చింది. అనుష్క కోసం దాదాపు 20కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని ముందుగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. ఎంత ఆలస్యం అయినాకుడా థియేటర్స్ లో రిలీజ్ కనిదే ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్స్ లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
దీంతో అనుష్క ఫ్యాన్స్ కి ఈ సినిమా విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లు సినిమా వస్తుందా రాదా..? అనే సందేహాలకు సమాధానం దొరికింది. కానీ సినిమా కరెక్ట్ గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలో దర్శకనిర్మాతలు ఇంకా నిర్ణయానికి రాలేదు.