Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
అనుష్క కోసం 20కోట్లు ఖర్చు పెట్టి.. ఓటీటీ రిలీజ్ అంటే ఎలా?
బాహుబలి సినిమా అనంతరం వేగంగా సినిమాలు చేస్తుందని అనుకున్న అనుష్క శెట్టి.. ఆ తరువాత కూడా హీరోల మాదిరిగానే నెమ్మదిగా వర్క్ చేస్తోంది. ఒక సినిమా తరువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుంటోంది. కొడితే బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్న స్వీటీ బాగమతి తరువాత చాలా గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేసిన చిత్రం సైలెన్స్. తెలుగులో ఈ సినిమా నిశ్శబ్దం అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమా ఈ ఏడాది మొదటి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరిలో రిలీజ్ కావాల్సిన సైలెన్స్ సినిమా నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఇంకా వాయిదా పడుతూనే ఉంది. కరోనా లాక్ డౌన్ వల్ల మరో రెండు నెలలు థియేటర్స్ క్లోజ్ కాబట్టి వెయిట్ చేయక తప్పదు. రెండు నెలల తరువాత కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే ఈ సినిమాను డిజిటల్ వరల్డ్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది.
కానీ అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటి ఇచ్చింది. అనుష్క కోసం దాదాపు 20కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని ముందుగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. ఎంత ఆలస్యం అయినాకుడా థియేటర్స్ లో రిలీజ్ కనిదే ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్స్ లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
దీంతో అనుష్క ఫ్యాన్స్ కి ఈ సినిమా విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లు సినిమా వస్తుందా రాదా..? అనే సందేహాలకు సమాధానం దొరికింది. కానీ సినిమా కరెక్ట్ గా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలో దర్శకనిర్మాతలు ఇంకా నిర్ణయానికి రాలేదు.