Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎట్టకేలకు నిశ్శబ్దం రిలీజ్.. అక్టోబర్ 2న అమెజాన్లో ప్రేక్షకుల ముందుకు
జేజమ్మ అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం ఓటీటీ ద్వారా రిలీజ్ కావడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 2వ తేదీన నిశ్శబ్దం చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.
తెలుగు, తమిళ, మలయాళంలో రిలీజ్ కానున్న నిశ్శబ్దం చిత్రాన్ని వాస్తవానికి థియేటర్లలో రిలీజ్ చేయాలని వేచి చూశారు. కానీ పరిస్థితులు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఈచిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించినట్టు యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మించగా ఆర్ మాధవన్, అనుష్క శెట్టి, అంజలి ముఖ్య పాత్రల్లో నటించారు.
సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన నిశ్శబ్దం చిత్రంలో అనుష్క శెట్టి మాటలురాని మరియు వినికిడి లోపం ఉన్న ఒక కళాకారిణిగా నటించింది. అనుష్క భర్త అదృశ్యం కావడంతో అతడిని ఆచూకి తెలుసుకొనే ప్రయాణమే ఈ సినిమా కథ నేపథ్యమని చిత్ర యూనిట్ వెల్లడించింది. షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలను పోషిస్తున్నారు. హాలీవుడ్ నటుడు కిల్ బిల్ , వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ ఫేమ్ మైఖేల్ మాడ్సన్ ీ చిత్రం ద్వారా భారతీయ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. దాదాపు 200 దేశాల్లో ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అవుతుందని పేర్కొన్నారు.
విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుకొన్న చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు ముందుకు తీసుకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి అని దర్శకుడు హేమంత్ మధుకర్ తెలిపారు.