Don't Miss!
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వెండితెరపై మరో ప్రముఖ హీరో కూతురు.. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ
జాహ్నవి కపూర్, సారా అలీ ఖాన్ తర్వాత మరో ప్రముఖ హీరో కూతురు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నది. ఇప్పటికే అనన్యపాండే, కరణ్డ్ డియోల్, అహాన్ శెట్టి లాంటి ప్రముఖుల వారసులు హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా అర్జున్ రాంపాల్ కూతురు మహిఖా రాంపాల్ బాలీవుడ్లో ప్రవేశించనున్నారు.
ఇటీవల మీడియాతో అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.. మహిఖాకు నటన అంటే ఇష్టం. నటిగా రాణించాలనే కోరికను బయటపెట్టింది. త్వరలోనే నా కూతురు వెండి తెర మీద కనిపించబోతున్నది అని తెలిపారు.
అర్జున్ రాంపాల్, మెహర్ జెసియా దంపతులు సంతానం మహిఖా రాంపాల్ అనే సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా అర్జున్ రాంపాల్, మెహర్ జెసియా విడిపోయారు. 20 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు చెప్పినప్పటి నుంచి వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
భార్య మెహర్ జెసియాతో విడిపోయిన తర్వాత గ్యాబ్రియేలా డెమెట్రియాడెస్ అనే యువతితో అర్జున్ రాంపాల్ డేటింగ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు వారిద్దరూ అతి సన్నిహితంగా మీడియా కంటపడుతున్న సంగతి తెలిసిందే.