Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అర్ద శతాబ్ధం ఫస్ట్ లుక్కు అదిరిపోయే రెస్పాన్స్
అర్ధ శతాబ్దపు అజ్ఞాన్నే స్వతంత్రమందామా..? అంటూ సిరివెన్నెల రాసిన ఈ పాట ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అంతటి సంచలనం సృష్టించిన ఆ పాటలోని పల్లవిని తీసుకుని అర్ధ శతాబ్దం అంటూ టైటిల్ పెట్టి ఓ సినిమాను తీయబోతోన్నారు. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ హీరో హీరోయిన్లుగా నవీన్ చంద్ర, సాయి కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్న చిత్రం 'అర్ద శతాబ్ధం.
రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు ఈ చిత్రాన్న నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతులమీదుగా విడుదలైన'అర్ద శతాబ్ధం' కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తోందని, ప్రతి పాత్ర ఒక హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నట్టు తెలిపారు నిర్మాతలు.
కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ మరియు ఇతర తారాగణం నటిస్తోన్న ఈ చిత్రానికి. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. చిట్టి కిరణ్ రామోజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడ. అష్కర్ సినిమాటోగ్రఫర్గా, నౌఫల్ రాజా మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్నాడు. జె ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. రెహమాన్ పాటలకు సాహిత్యాన్ని అందించారు.