Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ పక్కన నిలబడే అర్హత కూడా లేదు: ‘మహర్షి’ సక్సెస్ మీట్లో పెద్దాయన భావోద్వేగం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' సూపర్ హిట్ టాక్తో దూసుకెళుతోంది. సినిమా తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు, అశ్వినీదత్ ఆదివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు అల్లరి నరేష్, దేవిశ్రీ ప్రసాద్; పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'మహర్షి' మూవీలో రిషికి వ్యవసాయం చేయడం నేర్పించే రైతు పాత్రలో నటించిన గురుస్వామి... ఈ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నేను స్టేజీ ఆర్టిస్టును, కెమెరా ముందు నటించడం తెలియదు. డైరెక్టర్, వారి టీమ్ కెమెరా ముందు ఎలా నలబడాలి, ఏ యాంగిల్లో చూడాలి అనే విషయాలు దగ్గరుండి నేర్చించారు.
నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. మా తండ్రిగారు కూలీ చేసేవారు. ఆయన కష్టపడి చదివిస్తే పల్లెటూరిలో చదువుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే నాటకాలపై ఆసక్తి కలిగింది. కర్నూలులో సోషల్ నాటకాలు వేయడం మొదలు పెట్టి స్టేజీ ఆర్టిస్టును అయ్యాను. ఇపుడు నాటకాలకు ఆదరణ తగ్గిపోయింది. యువత షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా నేను ఓ షార్ట్ ఫిల్మ్లో నటించగా డైరెక్టర్ గారు చూసి నన్ను పిలిపించి ఈ అవకాశం ఇచ్చాకగ, ఇదంతా దైవ సంకల్పమే అని గురుస్వామి తెలిపారు.
మహేష్.. ఆడపిల్లగా పుడితే ఒప్పుకొనే వరకు వెంటపడేదానిని.. అందంగా లేవని పెళ్లాలు ప్రశ్నిస్తున్నారు
నా జీవితంలో మహేష్ బాబుగారి పక్కన నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. మా ఊరిలో పిల్లలు అంతా చెప్పుకుంటూ ఉంటారు... ఆయన పెద్ద నటుడు, ఆయనతో నువ్వు నటించడం అంటే గొప్ప అవకాశం, ఆయన పక్కన నిలబడటానికే అర్హత లేదు అనేవారు. అలాంటి అవకాశం ఇచ్చిన దర్శకుడు వంశీ పైడపల్లికి ధన్యవాదాలు అంటూ గురుస్వామి భావోద్వేగానికి గురయి కంటతడి పెట్టారు. వెంటనే వంశీ పైడిపల్లి నిలబడి గురుస్వామిని ఆలింగనం చేసుకుని ఓదార్చగా... మహేష్ బాబు, అల్లరి నరేష్ సైతం నిలబడి చప్పట్లు కొడుతూ పెద్దాయన పట్ల గౌరవం చాటుకున్నారు.
నేను వయసులో పెద్దవాన్ని అవ్వొచ్చు కానీ... మీ(మహేష్ బాబు) టాలెంటు ముందు, సాధించిన ఘనత ముందు చిన్నవాడినే అని గురుస్వామి వ్యాఖ్యానించారు. మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' తెరకెక్కింది. ఈ చిత్రం తొలి 3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 కోట్లకుపైగా షేర్ వసూలు చేసంది. పూజా హెడ్గే హీరోయిన్గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.