Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీరాం, సంచిత పదుకోన్ మధ్య ‘అసలేం జరిగింది’?
శ్రీరాం, సంచితా పదుకోన్ హీరోహీరోయిన్లుగా ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న చిత్రం 'అసలేం జరిగింది'. సినిమాటోగ్రాఫర్ ఎన్వీఆర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కె నీలిమ నిర్మాత. హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ వంటి ప్రాంతాల్లో.. దాదాపు నలభై రోజుల పాటు సాగిన షూటింగ్ ముగిసింది.
ఫైట్ మాస్టర్ శంకర్ నేతృత్వంలో భారీ స్థాయిలో యాక్షన్ సీన్లు తెరకెక్కించారు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని కో- ప్రొడ్యూసర్ కింగ్ జాన్సన్ కొయ్యడ తెలిపారు. మాస్టర్ ఈశ్వర్ ఈ సినిమా ద్వారా కొరియోగ్రాఫర్గాపరిచయమవుతున్నారని.. యూత్ని ఆకట్టుకునే విధంగా డాన్స్ సీక్వెన్స్లను సమకూర్చారని అన్నారు.
సినిమాలో ఒక మాస్ సాంగ్ని దాదాపు రెండు వందల మంది ఆర్టిస్టులతో చిత్రీకరించగా.. మరో పాటను నాలుగు వందల మందితో చిత్రీకరించామని వెల్లడించారు. కొరియోగ్రాఫర్ మాస్టర్ హరి నేతృత్వంలో ఐటెం సాంగ్ను ఆకర్షణీయంగా షూట్ చేశామన్నారు.
సినిమా నాణ్యతలో కాంప్రమైజ్ కాకుండా ఉండటానికి.. 8కె రెజల్యూషన్ గల రెడ్ మాన్స్ట్రో కెమెరాను ఈ సినిమా చిత్రీకరణ కోసం వినియోగించామని తెలిపారు. లవ్, సస్పెన్స్, యాక్షన్ ఎంటర్టైనర్గా నిర్మించిన అసలేం జరిగింది సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు.
తాము అనుకున్నదానికంటే మెరుగ్గా ఈ సినిమాను డైరెక్టర్ ఎన్వీఆర్ తెరకెక్కించారని చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసి మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.