Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
గత ఏడాది కరోనా కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కరోనా లాక్డౌన్ లో కూడా అలాగే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు హీరోయిన్ ప్రణీత సుభాష్, ఈరోజు యామి గౌతమ్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టగా నాటకం అనే సినిమాలో హీరోగా నటించి ప్రస్తుతం మరో మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్న ఆశిష్ గాంధీ వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు.
హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిత అనే యువతితో ఆయన ఏడు అడుగులు వేశారు. ఆదివారం నాడు ఆయన వివాహం అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య వైభవంగా జరిగినట్లు సమాచారం. ముందు వీరిద్దరూ ప్రేమించుకోగా ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. తన వివాహం గురించి ఆశిష్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో తనను చూసి నిఖిత ఇష్ట పడింది అని అప్పటి నుంచి ఎప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగిన ప్రతిసారీ గమనిస్తూ ఫాలో అవుతూ ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ విషయాలు నిఖిత నాతో చెబుతున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అని చెప్పుకొచ్చిన ఆయన తాను కూడా ఆమెతో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చారు. తాను కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న ఆయన ముఖ్యంగా తను నా వ్యక్తితగతమైన విషయాలను బాగా అర్థం చేసుకుంటుందని అన్నారు.