Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రంగంలోకి మహేష్ బాబు మేనల్లుడు.. రామ్ చరణ్, రానా సహకారం
టాలీవుడ్ చిత్రసీమలో మరో సినీ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు (ఆదివారం) సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా అశోక్ గల్లా తొలి చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విచ్చేశారు.
అమర్రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పద్మావతి గల్లా నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమర్రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లోగోను ఆవిష్కరించారు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామ్చరణ్ క్లాప్ ఇవ్వగా రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సూపర్స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు సూపర్స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, పద్మావతి గల్లా, జయదేవ్ గల్లా స్క్రిప్ట్ను అందించారు.
ఈ కార్యక్రమంలో సూపర్స్టార్ కృష్ణ, రానా దగ్గుబాటి, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, నన్నపనేని రాజకుమారి, అమల అక్కినేని, నమ్రత శిరోద్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి కొద్ది రోజుల్లో సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించనుంది. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.