Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటు... ప్రభాస్ కూడా భాగస్వామి? ఎక్కడో తెలుసా?
మనం ఇప్పటి వరకు అతిపెద్ద స్క్రీన్ మీద సినిమా చూడటం అంటే హైదరాబాద్లోని ఐమాక్స్ లార్జ్ స్క్రీన్లో మాత్రమే. అయితే ఇపుడు అంతకు మించిన పెద్ద స్క్రీన్ తెలుగువారికి అందుబాటులోకి రాబోతోంది. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలోనే కాదు...ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్.
ఇందులో స్క్రీన్ సైజ్ 102.6 అడుగుల వెడల్పు, 56 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ప్రపంచంలోని అతి పెద్ద సిల్వర్ స్క్రీన్స్లో ఇది థర్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్గా చెప్పుకుంటున్నారు. ఆసియాలో ఇంత పెద్ద స్క్రీన్ ఎక్కడా లేదట. నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలోని 'వి ఎపిక్' మల్టీప్లెక్స్ థియేటర్లో ఈ అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటయింది.
ఈ మల్టీప్లెక్స్లో మొత్తం మూడు స్క్రీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి అతిపెద్ద స్క్రీన్. ఇది 647 సీట్ల కెపాసిటీతో ఉంటుందని సమాచారం. మిగతా రెండు చిన్న స్క్రీన్లు 140 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు కృష్ణం రాజు హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆగస్టు 30న విడుదలకాబోయే 'సాహో' మూవీతో మల్టీ ప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగబోతోందట. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణంలో యువి క్రియేషన్స్ అధినేత్లో ఒకరైన వేమారెడ్డి వంశీ కృష్ణారెడ్డితో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భాగస్వామిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సాహో మూవీ విషయానికొస్తే.... ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్తో యూవి క్రియేషన్స్ వారు రూపొందించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, ఎవలీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.