రకుల్ ప్రీత్ సింగ్ జైలుకు వెళ్తుందా? భర్తతో విడాకులు?
వివాదాస్పద ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పరిస్థితి దారుణంగా కనిపిస్తున్నది. మీడియా ఫిర్యాదు తర్వాత అరెస్ట్ అవుతారేమో అనే ఊహాగానాల మధ్య ఆయన, తన భార్య వీణాతో కలిసి రిలీజ్ చేసిన వీడియో మరింత వివాదాస్పదంగా మారింది. ప్రముఖ టెలివిజన్ ఛానెల్కు చెందిన జర్నలిస్టులపై చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ధాంతో సదరు టీవీ ఛానెల్ ఆయన బాగోతాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఆ సందర్భంగా వారు రకుల్ ఫ్రీత్ సింగ్ గురించి చేసిన కామెంట్లను లైవ్లో వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ టెలివిజన్ ఛానెల్ లైవ్ కార్యక్రమంలో వేణు స్వామి చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ జాతకం ప్రకారం.. ఆమె తన కాబోయే భర్త జాకీ భగ్నానీతో కొన్ని సమస్యలు ఉన్నాయి. రాశుల కలయిక లేదు. గ్రహాలు అనుకూలించకపోవడం జరుగుతుంది. దాని వల్ల సంతానం కలుగపోవడం, వివాహ బంధంలో అనేక సమస్యులు, న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతాయని ఆయన చెప్పారు.

రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ జాతకంపై విపులంగా విశ్లేషిస్తూ.. గ్రహాలు, రాశుల మధ్య సమతూల్యం లేకపోవడం వల్ల, అనుగ్రహించకపోవడం వల్ల ఇలాంటి వారికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. రకుల్ రాశి మిథనం, జాకీ రాశి కర్కాటకం కాబట్టి వాటి మధ్య పొసగడం లేదు అని చెప్పారు.
రకుల్ ప్రీత్ దంపతులకు షష్ట అష్టకాల దోషం ఉంది. షష్ట అంటే ఆరు.. అష్ట అంటే 8 ఎనిమిది. రకుల్, జాకీ పెళ్లి చేసుకొంటే.. గ్రహ దోషం వల్ల వివాహం ఆ తర్వాత విడిపోతారు. వివాహం జరిగితే.. ఆమెకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడి జైలుకు కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి అని జోస్యం చెప్పారు.

ఇలా వేణుస్వామి చెప్పడంపై ప్రముఖ టెలివిజన్ చానెల్ జర్నలిస్టు మూర్తి తప్పు పట్టారు. ఆయన చెప్పినదంతా తప్పే. న్యూమరాలజీ జ్యోతిష్యం కిందకు రాదు. ఆయన తనకు తెలియని జ్యోతిష్యంతో సెలబ్రిటీలను, ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేసి వారిని భయపడుతున్నారు. చాలా మంది వద్ద పూజల పేరుతో డబ్బుల లాగుతున్నారు అని ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ జరిగింది. అయితే తన భర్తకు ఆర్థిక పరమైన సమస్యలతోపాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పాడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేణు స్వామి చెప్పినట్టే రకుల్ ప్రీత్ సింగ్కు జరగబోతుందా? వేణు స్వామికి అసలు జ్యోతిష్యం వస్తుందా అనే ప్రశ్నలు ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి.


Click it and Unblock the Notifications











