Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అ! దర్శకుడి ఆలోచనలు మామూలుగా లేవు.. అంతకు మించిన కథలు!
డిఫరెంట్ గా ప్రయత్నం చేసి ప్లాప్ అందుకున్న కూడా కొంతమంది దర్శకులు ఓ వర్గం ఆడియెన్స్ ని గట్టిగానే ఆకర్షిస్తారు. ఉదాహరణకు క్రిష్ సినిమాలు కలెక్షన్స్ తో సంబంధం లేకుండా ప్రశంసలు అందుకుంటాయి. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు నిత్యం రెడీగా ఉంటారు. అయితే అదే రూట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి అ!దర్శకుడు ప్రశాంత్ వర్మ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.
నాని ఎంతగానో నమ్మి తన మొదటి ప్రొడక్షన్ హౌజ్ లో ప్రశాంత్ వర్మకి అ! సినిమాతో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. సీక్వెల్ కథను రెడీ చేసినప్పటికీ ఎందుకో నాని మళ్ళీ అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక అ! తరువాత రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేసిన ప్రశాంత్ వర్మ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.
ఆ సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇక నెక్స్ట్ కూడా ఆడియెన్స్ ని థ్రిల్ చేయాలని ప్రశాంత్ దాదాపు 30కథలను రెడీ చేసుకున్నాడట. ఇక తమిళ్, హిందీ నుంచి అ! సినిమాను రీమేక్ చేసే ఆఫర్స్ వస్తున్నప్పటికీ ప్రశాంత్ ఏ మాత్రం ఒప్పుకోవడం లేదట.
వీలైనంత వరకు తెలుగులో అ! సీక్వెల్ ని రెడీ చేయాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జాంబీ రెడ్డి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కంటే డేంజర్ అంటూ తనదైన శైలిలో సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. అలాంటి సినిమా ఇంతవరకు తెలుగులో రాలేదనే టాక్ వస్తోంది. మరి ఈ సారైనా దర్శకుడు అన్ని వర్గాల ఆడియేన్స్ ని మెప్పిస్తాడో లేదో చూడాలి.