బి.సరోజాదేవికి టీఎస్ఆర్ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం

సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఏటా విశాఖ సాగరతీరంలో నిర్వహించే మహా కుంభాభిషేకం ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు సాగరతీరానికి తరలివచ్చారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటి బి.సరోజాదేవికి 'విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా కళాబంధు సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకొన్న కథానాయిక బి.సరోజాదేవి. అందుకే ఆమెకి తెలుగు ప్రజల తరఫున 'విశ్వనట సామ్రాజ్ఞి'' బిరుదు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు.

B Saroja Devi Received Vishvanata Saamraagni title

సరోజాదేవి మాట్లాడుతూ... 'టి.సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది. నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు 'చిటపట చినుకులు పడుతూ ఉంటే...పాటని గుర్తు చేస్తుంటారు. 'కృష్ణార్జునయుద్ధం'లో నేను ఎన్టీఆర్‌ని చిన్నన్నయ్యా అంటుంటాను. ఆ సంభాషణని గుర్తు చేసి ఒకసారి చెప్పండని అడుగుతుంటారు. మరోసారి ఈ వేదికపై ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంది.' అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, పడాల అరుణ, నటుడు, ఎంపీ మురళీమోహన్‌ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X