Don't Miss!
- Sports Ravichandran Ashwin:అతను ధోనీకి లెఫ్టాండ్ వర్షన్!
- News చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ విచారించిన సుప్రీంకోర్టు
- Technology Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
వెంకటేష్ క్లాప్తో ప్రారంభమైన యాక్షన్ థ్రిల్లర్ '22'
శివకుమార్ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'. ఈ చిత్రం ప్రారంభోత్సవం జులై 22న రామానాయుడు స్టూడియోస్లో ఘనంగా జరిగింది. దర్శకుడు శివకుమార్ మరెవరో కాదు... దివంగత దర్శకురాలు జయ, బిఏ రాజు దంపతుల కుమారుడు.
హీరోహీరోయిన్లపై విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, నవీన్ ఎర్నేని, కొండా కృష్ణం రాజు సంయుక్తంగా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు షాట్కు ప్రముఖ దర్శకులు భీమినేని శ్రీనివాస రావు గౌరవ దర్శకత్వం వహించగా, హరీష్ శంకర్ చిత్ర డైరెక్టర్ శివకుమార్కి స్క్రిప్ట్ అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
దర్శకుడు శివకుమార్ బి. మాట్లాడుతూ - ''నేను దర్శకుడిగా పరిచయమయుతున్న తొలి చిత్రమిది, విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టడం సంతోషంగా ఉంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సాయి తేజ్ గారి రెండు సినిమాలకు పని చేశాను. ఆయన ఈ కార్యక్రమానికి రావడం హ్యాపీగా ఉందని తెలిపారు.
ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేం పూజా రామచంద్రన్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తుంది. ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. అలాగే 'బాహుబలి', 'ఖైదీ నెం 150 ','సాహో' చిత్రాలకి వర్క్ చేసిన జాషువాగారి యాక్షన్ సీక్వెన్స్ మా చిత్రానికి హైలైట్స్గా నిలుస్తాయన్నారు.
ఈ సినిమా టైటిల్ '22' అనేది ఒక నెంబర్. ఆ నెంబర్కి ఒక కీ ట్విస్ట్ ఉంది. అది రివీల్ చేస్తే ఆ కిక్ ఉండదు. మర్డర్ మిస్టరీతో మిక్స్ అయిన కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈనెల 29 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలిపారు.
ఈ చిత్రం పూజ కార్యక్రమాలు 'పవర్' మూవీ ఫేం దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) నిర్వహించారు. విశిష్ట అతిథిగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి సి.అశ్వనీదత్, కె.ఎస్. రామారావు, యం.యస్.రాజు, అనీల్ సుంకర, శ్యామ్ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.కె. రాధామోహన్, సముద్ర, నిమ్మకాయల ప్రసాద్, చిట్టూరి శ్రీనివాసరావు, సాగర్ తదితరులు హాజరై దర్శక నిర్మాతలకి, చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు.