Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలకృష్ణతో రీయల్ స్టోరీ.. ప్లాన్ చేంజ్ చేసిన క్రాక్ దర్శకుడు
నందమూరి బాలకృష్ణతో పక్కా మాస్ కమర్షియల్ దర్శకుడు సినిమా చేస్తే ఆ డోస్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్రాక్ లాంటి బాక్సాఫీస్ హిట్టుతో బాక్సాఫీస్ దర్శకుడిగా క్రేజ్ అందుకున్న గోపీచంద్ మలినేని తన తదుపరి సినిమాను బాలయ్య బాబుతో చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ కాంబో సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ
గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త కథను రెడీ చేసుకుంటున్న దర్శకుడు మొదట ఆ సినిమాను ఇదే ఏడాది రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల అది కుదిరేలా లేదు. ఇక అనంతపురంలోని కొన్ని నిజ జీవిత ఫ్యాక్షన్ అంశాల ఆధారంగా కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు కొన్ని ప్రాంతాలకు చెందిన మనుషులను కలిశాడు. అలాగే పాత లైబ్రరీ లలోని న్యూస్ పేపర్లను వెలికి తీశారు.
క్రాక్ తరహాలోనే ఎలాగైనా బాలయ్యతో హిట్టు కొట్టాలని రెడీ అవుతున్న గోపిచంద్ కు కరోనా కొంత బ్రేక్ వేసింది. సినిమా ప్లానింగ్ లో ఇప్పుడు మార్పులు చేయక తప్పడం లేదు. మే నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పెరుగుతున్న కారణంగా జూన్ లోనే లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ ను జూలై లేదా కరోనా ప్రభావం తగ్గిన అనంతరం మొదలు పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం.