Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణతో రీయల్ స్టోరీ.. ప్లాన్ చేంజ్ చేసిన క్రాక్ దర్శకుడు
నందమూరి బాలకృష్ణతో పక్కా మాస్ కమర్షియల్ దర్శకుడు సినిమా చేస్తే ఆ డోస్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్రాక్ లాంటి బాక్సాఫీస్ హిట్టుతో బాక్సాఫీస్ దర్శకుడిగా క్రేజ్ అందుకున్న గోపీచంద్ మలినేని తన తదుపరి సినిమాను బాలయ్య బాబుతో చేయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ కాంబో సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ
గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త కథను రెడీ చేసుకుంటున్న దర్శకుడు మొదట ఆ సినిమాను ఇదే ఏడాది రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల అది కుదిరేలా లేదు. ఇక అనంతపురంలోని కొన్ని నిజ జీవిత ఫ్యాక్షన్ అంశాల ఆధారంగా కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు కొన్ని ప్రాంతాలకు చెందిన మనుషులను కలిశాడు. అలాగే పాత లైబ్రరీ లలోని న్యూస్ పేపర్లను వెలికి తీశారు.
క్రాక్ తరహాలోనే ఎలాగైనా బాలయ్యతో హిట్టు కొట్టాలని రెడీ అవుతున్న గోపిచంద్ కు కరోనా కొంత బ్రేక్ వేసింది. సినిమా ప్లానింగ్ లో ఇప్పుడు మార్పులు చేయక తప్పడం లేదు. మే నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పెరుగుతున్న కారణంగా జూన్ లోనే లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ ను జూలై లేదా కరోనా ప్రభావం తగ్గిన అనంతరం మొదలు పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం.