Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
బాలయ్య ఆన్ డ్యూటీ.. స్పెషల్ వెహికల్లో హిందూపూర్కి కోవిడ్ కిట్స్!
నందమూరి బాలకృష్ణ ఒకపక్క సినిమాల్లో రాణిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం తరఫున హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. రాష్ట్రమంతా జగన్ గాలి వీచినా సరే హిందూపురం నియోజకవర్గంలో మాత్రం భారీ మెజారిటీతో బాలకృష్ణ గెలుపొందారు.. అందుకే తన నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఆయన అక్కడి వారికి అండగా నిలబడుతూ ఉంటారు. తాజాగా బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.
హిందూపురం నియోజకవర్గంలో కరోనా బారిన పడిన వారి కోసం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో కరోనా కిట్స్ పంపించినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసానికి దాదాపు రెండు వేల కరోనా కిట్స్ పంపారని అంటున్నారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న దాదాపు రెండు వేల మందికి ఉచితంగా ఈ మందులు పంపిణీ చేస్తామని కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ ప్రకటించారు. పదకొండు వందల రూపాయల ఖరీదు చేసే ఈ మెడికల్ కిట్లు దాదాపు 2000 హిందూపురానికి చేరుకోవడంతో బాలకృష్ణ నివాసం వద్ద కోవిడ్ బాధితుల బంధువులకు అందజేశారు.
కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ఆధార్ కార్డు, పాజిటివ్ రిపోర్ట్ చూపించి ఆ వ్యక్తి బంధువులు గాని స్నేహితులు గాని వచ్చి 14 రోజులకు సరిపడా ఉండే ఈ కిట్ ను పొందవచ్చని ఎమ్మెల్యే కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇక ఇవి పూర్తిగా నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత నిధులతో ఏర్పాటు చేసిన కిట్స్ అని తెలుస్తోంది. మరోపక్క ప్రభుత్వం కూడా కరోనా కేసులు కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.దీంతో బాలకృష్ణ తన వంతుగా ఈ విధంగా తన నియోజకవర్గ ప్రజలకు కిట్స్ పంపారని అంటున్నారు.