Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
బాలకృష్ణ 'నర్తనశాల'టికెట్ రేట్ ఫిక్స్.. సౌందర్య కోసమైనా అంత పెట్టాల్సిందే!
అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు వంటి వారు నటించిన బాలకృష్ణ నర్తనశాల ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. 16 ఏళ్ల క్రితం అనుకోకుండా ఆగిపోయిన ఈ సినిమా తాలూకు 17 నిమిషాల సీన్స్ ని డిజిటల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకి తీస్తున్న బాలకృష్ణ సినిమా చూడటానికి ఒక రేటును కూడా ఫిక్స్ చేశారు.
ఎన్టీఆర్ నర్తనశాల ఆధారంగానే..
బాలకృష్ణ 16ఏళ్ల క్రితం నర్తనశాల అనే సినిమాను తన దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నాడు. సినిమాను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. 1963లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన నర్తనశాల ఆధారంగానే ఆ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే సడన్ గా సినిమాకు అనుకోని సమస్యలు వచ్చి పడడంతో ఆపేశారు. అదే సమయంలో సౌందర్య కూడా మరణించింది.
బాలయ్య ఎందుకో ధైర్యం చేయలేదు
ముందే ఈ ప్రాజెక్ట్ కు కొన్ని ఆర్థిక కారణాలు కూడా ఇబ్బందులు పెడుతున్న సమయంలో హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ద్రౌపతి పాత్ర చేయడానికి ఒప్పుకున్న సౌందర్య చనిపోవడంతో 2004లో ఆ సినిమా అలానే ఆగిపోయింది. అయితే ఆ సినిమాను మళ్ళీ తెరకెక్కించడానికి బాలయ్య ఎందుకో ధైర్యం చేయలేదు.
టికెట్ ధర 50రూపాయలు
ఇక షూట్ చేసిన 17 నిమిషాల ప్రింట్ ని అలానే దాచుకున్న బాలకృష్ణ మళ్ళీ ఆ ప్రింట్ ని డిజిటల్ రూపంలోకి కన్వర్ట్ చేశారు. అంతే కాకుండా ఇప్పుడు శ్రేయస్ etలోని ఎన్టిఆర్ థియేటర్లో దసరా కానుకగా 24న ప్రదర్శించబడుతుందని తెలిపారు. ఇక ఈ షార్ట్ మూవీని చేసేందుకు ఒక వ్యూవ్ కి 50 రూపాయల ధరను నిర్ణయించారు. ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
సౌందర్య కోసమైనా చూడాల్సిందే..
ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తం డబ్బును చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నారు. నిజానికి బాలకృష్ణ పెట్టిన ధర న్యాయమైందనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు 100, 200 రూపాయలు అంటూ అడల్ట్ సినిమాలతో భారీగా టికెట్స్ రేట్స్ ఫిక్స్ చేస్తున్న సమయంలో ఇలాంటి మంచి సినిమా కోసం బాలయ్య కేవలం 50 రూపాయలు మాత్రమే సెట్ చేశారు. ఇక చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను సౌందర్య కోసమైనా చూడాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.