Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిమ్మకూరుకు విద్యాబాలన్.. బాలయ్యతో కలసి...!
నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బాలయ్య బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరుకు బాలయ్య నేడు చేరుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ అక్కడకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణతో కలసి బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కూడా నిమ్మకూరుకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో మిగిలిన కొద్ది భాగం షూటింగ్ నిమకూరులోనే ఫినిష్ చేస్తారట. బాలకృష స్వయంగా తన తండ్రి పాత్రలో నటించడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేషధారణలో బాలయ్య 60కి పైగా గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. క్రిష్ ఎన్టీఆర్ చరిత్రని అద్భుతంగా ఆవిష్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. రానా దగ్గుబాటి, సుమంత్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇంకా ఇతర హీరోయిన్లు కీలక పాత్రలో నటించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.