twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిమ్మకూరుకు విద్యాబాలన్‌.. బాలయ్యతో కలసి...!

    |

    నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బాలయ్య బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరుకు బాలయ్య నేడు చేరుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ అక్కడకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

    బాలకృష్ణతో కలసి బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కూడా నిమ్మకూరుకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో మిగిలిన కొద్ది భాగం షూటింగ్ నిమకూరులోనే ఫినిష్ చేస్తారట. బాలకృష స్వయంగా తన తండ్రి పాత్రలో నటించడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేషధారణలో బాలయ్య 60కి పైగా గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం.

    Balakrishna and Vidya balan went to Nimmakuru

    ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. క్రిష్ ఎన్టీఆర్ చరిత్రని అద్భుతంగా ఆవిష్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. రానా దగ్గుబాటి, సుమంత్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇంకా ఇతర హీరోయిన్లు కీలక పాత్రలో నటించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

    English summary
    Balakrishna and Vidya balan went to Nimmakuru. NTR Kathanayakudu releasing world wide on Jan 9th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X