Don't Miss!
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిమ్మకూరుకు విద్యాబాలన్.. బాలయ్యతో కలసి...!
నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బాలయ్య బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరుకు బాలయ్య నేడు చేరుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ అక్కడకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణతో కలసి బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కూడా నిమ్మకూరుకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో మిగిలిన కొద్ది భాగం షూటింగ్ నిమకూరులోనే ఫినిష్ చేస్తారట. బాలకృష స్వయంగా తన తండ్రి పాత్రలో నటించడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేషధారణలో బాలయ్య 60కి పైగా గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. క్రిష్ ఎన్టీఆర్ చరిత్రని అద్భుతంగా ఆవిష్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. రానా దగ్గుబాటి, సుమంత్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇంకా ఇతర హీరోయిన్లు కీలక పాత్రలో నటించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.