ఆ ముగ్గురితో చెప్పించు..సీబీఐ డిసైడ్ చేస్తుంది..దమ్ముంటే రా..ఎంపీ సాయిరెడ్డికి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్'
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి ఇ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత బండ్ల గణేష్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాలలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ముందుగా బండ్ల గణేష్ మొదలుపెట్టిన ఈ మాటల యుద్ధాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ట్వీట్లకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

వరుస ట్వీట్లతో
కారణం ఏమిటో తెలియదు గానీ బండ్ల గణేష్ ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ, విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. అందులో తాను కమ్మ కులానికి చెందిన వాడిని కాబట్టి మీకు ఎవరితో అయినా ఇబ్బంది ఉంటే వ్యక్తుల పేర్లు పెట్టి తిట్టండి కానీ కమ్మ కులాన్ని తిట్టవద్దు అంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు.. కాస్త ఘాటుగానే ఆయన విజయసాయిరెడ్డిని సంభోదించడంతో విజయసాయిరెడ్డి కూడా వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లకు మళ్ళీ బండ్ల కౌంటర్ ఇచ్చారు.

కష్టపడ్డాం, నీలా దోచుకోలేదు
ఆకులు, వక్కలు, పక్కలు ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో...గణేశా అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేయగా ఎస్ నేను కుక్కనే కానీ దానిలా విశ్వాసం ఉన్నవాడిని.. నీలా పిచ్చికుక్కను కాదు తెలుసుకో దొంగ సాయి.. మేము ఏం చేసుకున్నా మా సొంతానికి చేసుకున్నాం కష్టపడ్డాం నీలా దోచుకోలేదు దొంగ సొమ్ము దాచుకోలేదు. ఒక్కటి గుర్తు పెట్టుకో దొంగసాయి అంటూ బండ్ల కౌంటర్ ఇచ్చారు.

తెలుగువాడిగా నా కర్తవ్యం
''వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీ వెనకాల లేకపోతే నీ చరిత్ర ఏంటో.. నీవు ఏంటో నీ బ్రతుకు ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకో తెలుస్తోంది'', మీ దగ్గర అధికారం ఉంది దొంగ సాయి గారు.. అరెస్ట్ చేయిస్తారో కేసులు పెట్టిస్తారో.. కొట్టిస్తారో ఇంకెన్ని చేస్తారో. అయినా మీతో నేను పోరాడుతూనే ఉంటా దొంగ సాయి గారు. ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యానవనంలో మొలచిన గంజాయి మొక్క మీరు.. ఆ గంజాయి మొక్కను పీకేసే ఒక తెలుగువాడిగా నా కర్తవ్యం'' అంటూ బండ్ల ట్వీట్ చేశారు.

జైల్లో పెట్టారు.. ఇది అబద్దమా..?
''నేను కుక్కనే గర్వం గా చెప్పుకుంటా నాకు అన్నం పెట్టి బతుకు ఇచ్చిన విశ్వాసం గల కుక్కని నీ లాగా పిచ్చి కుక్కని, గజ్జి కుక్కని, మోసపు కుక్కని కాదు దొంగ సాయి గారు, నువ్వు అన్నావ్ చూడు రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ వారిలో ఎవరితోనైనా స్టేట్మెంట్ ఇప్పి నేను వారిని మోసం చేశానని, నువ్వు మోసం చేశావు అని దేశం మొత్తం కోట్ల మంది కోడై కూస్తోంది'' అని ఆయన ట్వీట్ చేశారు. నువ్వు మోసగాడవి అని, నీవు ముద్దాయివి అని నిను బొక్కలో వేసి జైల్లో పెట్టారు.. ఇది అబద్దమా..? అంటూ ప్రశ్నించారు.

వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు
''నా మీద ఏ మున్నా ఏది ఉన్నా న్యాయస్థానం నాలాంటి చిన్నవాడిని ఎప్పుడూ ఊరుకోదు గుర్తు పెట్టుకో, దొంగ సాయి'' ఫోన్లు పగలటం, లాజిక్కులు చేయడం, సినిమాలు తీయడం వ్యాపారం కాదు, తప్పు కాదు దొంగ సాయి.. దేశాన్ని దోచుకోవడం, స్కాములు చేయడం, తప్పు పనులు చేయడం అది దొంగ పని సాయి.. సినిమాలు తీయడం, వ్యవసాయం చేయడం, వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు. జనాన్ని మోసం చేయడం, జనాన్ని మోసం చేయడం, ప్రభుత్వ సొమ్ము దోచుకోవటం అడ్డంగా బుక్కై జైలుకెళ్లడం తప్పు గుర్తు పెట్టుకో దొంగ సాయి'' అంటూ బండ్ల వరుస ట్వీట్లు చేశారు.


Click it and Unblock the Notifications











