Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బండ్ల గణేష్కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన ఇటీవల పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. బండ్ల గణేష్ కోవిడ్ 19 బారిన పడటం ఇది రెండోసారి. గతంలో జూన్ 2020న ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఇటీవల ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్నప్పటికీ ఆయనకు రెండోసారి కరోనాపాజిటివ్ అని తేలడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కోవిడ్19 పాజిటివ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బండ్ల గణేష్ను అపోలో హాస్పిటల్లోని ఐసీయూలో చేర్పించినట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది.
ఇటీవల కాలంలో వ్యాక్సిన్స్ తీసుకొన్న తర్వాత కూడా పలువురు సినీ ప్రముఖులు కరోనావైరస్ బారిన పడ్డారు. వారిలో అల్లు అరవింద్ కూడా ఉండటం తెలిసిందే. అయితే రెండో బారిన పడిన బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి తీవ్రతరం కావడంతో కుటుంబ సభ్యులు ఐసీయూలో చేర్పించినట్టు తెలిసింది.