Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
మీకు దండం పెడతా, పరువు తీయొద్దు.... బండ్ల గణేష్ రిక్వెస్ట్
ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉండే సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యర్థి పార్టీలపై తన పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడిన గణేష్... ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల సమయంలో పార్టీ ఓడిపోతే బ్లేడుతో తన గొంతుకోసుకుంటానంటూ గణేష్ చేసిన హడావుడి అప్పట్లో తెలుగు మీడియాలో సంచనం అయింది. అంతే కాదు ఓ వైపు సీరియస్గా పొలిటిక్స్ జరుగుతుంటే తన ఫన్నీ వ్యాఖ్యలు, చేష్టలతో తెలుగు రాష్ట్రాల ప్రజలను తెగ నవ్వించాడు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న గణేష్ తాజాగా ఓ పొలిటికల్ ఇష్యపై రియాక్ట్ అయ్యారు.
పల్నాడు పరువు తీయొద్దు అంటూ...
ఇటీవల పల్నాడు ప్రాంతంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశం అయింది. ఈ అంశంపై గణేష్ స్పందించారు. మీకు దండం పెడతాను, పల్నాడు పరువు తీయొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ తన సోషల్ మీడియా పేజీలో ఓ పోస్ట్ పెట్టారు.
ఆంధ్ర మరో బీహార్ అయింది అంటూ...
ఇప్పటికే గొడవలతో చాలా సార్లు పల్నాడు పరువు పోయింది. ఇలాంటి పనులకు దయచేసి పాల్పడవద్దు. ఆంధ్ర మరో బీహార్ మాదిరిగా తయారయ్యింది అంటూ తనదైన వ్యాఖ్యలు చేశారు గణేష్. ఇరు పార్టీల వారు కలిసి పని చేస్తూ ప్రజలకు మంచి జరిగేలా చూడాలని కోరారు.
దగా పడ్డ తెలుగు ప్రజలారా ఏ నాయకుడినీ నమ్మొద్దు
అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య గొడవ జరుగుతుండంతో.... బండ్ల గణేష్ కాస్త పదునైన వ్యాఖ్యలే చేశారు. దగా పడ్డ తెలుగు ప్రజలారా ఏ నాయకుడినీ నమ్మొద్దు అంటూ వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా రెండు వర్గాలను విమర్శించే ప్రయత్నం చేశారు.
మీకు సహాయం చేసే స్థితిలో లేను
మీకు సహాయం చేసే స్థితిలో నేను లేను, మననల్ని ఆ దేవుడే కాపాడాలి, ఆయనే అందరి సమస్యలు తీరుస్తాడు అంటూ బండ్ల గనేష్ వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. దీన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.