Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలయ్య నుంచి ఒకేసారి రెండు సర్ప్రైజ్లు: అదిరిపోయే ప్లాన్ చేసిన నటసింహం
ఆరు పదుల వయసులోనూ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తుంటారు నటసింహా నందమూరి బాలకృష్ణ. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే ఆయన.. 2019లో వరుసగా మూడు ఫ్లాపులను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే షూటింగ్ కూడా ప్రారంభించారు. కానీ, లాక్డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్ జరగలేదు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే బాలయ్య మరో ప్రాజెక్టునూ లైన్లో పెట్టారు.
'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తుండగా.. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రను చేస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'మోనార్క్', 'ధర్మ' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చనున్నాడు. ఈ సినిమా టైటిల్ను శివరాత్రి సందర్భంగా మార్చి 11న అనౌన్స్ చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది.
BB3 పట్టాలపై ఉండగానే.. నందమూరి బాలకృష్ణ 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. దీనిపై గతంలో సదరు దర్శకుడు.. ఇటీవల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. దీంతో ఈ సినిమాపై ప్రకటనకు ముందు నుంచే బజ్ ఏర్పడింది. ఇక, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనను సైతం శివరాత్రి సందర్భంగా మార్చి 11నే వెల్లడించనున్నారని మరో న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అంటే.. ఒకేరోజు నందమూరి అభిమానులకు రెండు శుభవార్తలు రాబోతున్నాయన్న మాట.