Don't Miss!
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- News సీఎం జగన్ యాత్ర పై నిఘా - కీలక నిర్ణయాలు..!!
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
బెల్లంకొండ వారి అబ్బాయికి వరుస ఆఫర్స్ ... ఏమిటో రహస్యం?
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా మరో కొత్త సినిమా ప్రారంభమైంది. రైడ్, వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్న ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్పై కొనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
గురువారం(జనవరి 21) హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హవీష్ క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 'అల్లుడు శ్రీను' హీరోగా కెరీర్ ప్రారంభించిన బెల్లంకొండకు కెరీర్లో అంత పెద్ద హిట్స్ ఏమీ లేవు. అయినప్పటికీ వరుస సినిమా ఆఫర్స్ వస్తుండటం ఆశ్చర్య పరుస్తోంది.
బెల్లంకొండ నటించిన 'సాక్ష్యం', 'కవచం' 2018లో విడుదలై బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి. ప్రస్తుతం అతడు తేజ దర్శకత్వంలో 'సీత' అనే మూవీ చేస్తున్నారు. ఆ మూవీ సెట్స్ మీద ఉండగనే ఇపుడు మరో సినిమా ప్రారంభం కావడం గమనార్హం.
ఈ సినిమా గురించి నిర్మాత హవీష్ కొనేరు మాట్లాడుతూ తమిళంలో సూపర్డూపర్హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ను రమేష్వర్మగారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.