Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మరో సినిమా లైన్లో పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్!
వరుస సినిమాలు చేస్తున్నా బెల్లంకొండ శ్రీనివాస్ కు సరైన విజయం దక్కడం లేదు. క్రేజీ కాంబినేషన్లు సెట్ అవుతున్నా ఈ హీరోకు విజయం మాత్రం దూరంగానే ఉంటోంది. ఈ ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తేజ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాని ప్రకటించాడు. అభిషేక్ అగర్వాల్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
పూర్తిస్థాయి ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శత్వంలో వహించబోతున్నారు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. వరుస చిత్రాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ కు ఊపునిచ్చే సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.