Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శూర్పణఖ మళ్లీ పుడితే.. కొత్తగా చెప్పబోతున్న దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత..
తెలుగులో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం "కిట్టు " (2006) తో జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత భార్గవ దర్శకత్వంలో "శూర్పణఖ " పేరుతో ఒక చిత్రం రూపొందనుంది . భార్గవ పిక్చర్స్ , కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్లపై భార్గవ , D.R రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు . ఈ సందర్భంగా రచయిత , దర్శకుడు భార్గవ మాట్లాడుతూ.. ''మైథలాజికల్ సోషల్ కామెడీ చిత్రం ఇది. రామాయణంలో కీలకమైన మలుపులు శూర్పణఖ వల్లనే సంభవించాయి.
శూర్పణఖ ప్రస్తుత సమకాలీన సమాజంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనే కధాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది . అసలు శూర్పణఖ ఇప్పుడు ఎలా వచ్చింది? అసలు వచ్చి ఏం చేసింది? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం శూర్పణఖ దృక్కోణం నుండి రామాయణం చెప్పడమే! శూర్పణఖ ఏ విధంగా అప్పటి లంకను , ఇప్పటి సమాజంతో, అలాగే అప్పటి ప్రజల్ని ఇప్పటి ప్రజలతో ఎలా పోలుస్తుందో ఈ చిత్రంలో కథ గా అల్లడం జరిగింది'' అని తెలిపారు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన D.R రెడ్డి మాట్లాడుతూ ''శూర్పణఖ పాత్ర ని ఒక ప్రముఖ నటి చేయబోతుంది . ఆ వివరాలు మరియు మిగిలిన నటీనటులు , సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తాం . ఈ చిత్రం లో vfx కు అధిక ప్రాధాన్యత ఉండడం వలన ప్రీ ప్రొడక్షన్ పకడ్బందీగా చేసుకుంటున్నాం . వచ్చే నెలలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది '' అని తెలిపారు .
ఈ
చిత్రానికి
కథ
,
మాటలు,
కథనం
,
దర్శకత్వము
-
భార్గవ
.
నిర్మాతలు:
భార్గవ,
D.R
రెడ్డి
బ్యానర్స్:
భార్గవ
పిక్చర్స్,
కాస్మిక్
రే
ప్రొడక్షన్స్.