నాయక్ భార్య అంటే సగం కాదు.. డబుల్.. భీమ్లా నాయక్ కొత్త ట్రైలర్ డబల్ ధమాకా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ లో సినిమా యూనిట్ తలమునకలై ఉంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 23వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడా లో ఘనంగా జరుపుతున్నారు. ఇప్పటికే అభిమానుల కోసం ఒక ట్రైలర్ విడుదల చేయగా ఇప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా మరింత ఊపు పెంచేందుకు మరో ట్రైలర్ కూడా విడుదల చేసి డబుల్ ట్రీట్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అసంఖ్యాఖ అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరు కాగా ఆయనతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్ హాజరయ్యారు. నిజానికి ఈ ప్రీ రిలీజ్ వేడుక 21వ తేదీన ఘనంగా జరగాల్సి ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి మరణంతో వాయిదా పడింది.

అయితే ఆరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని భావిస్తూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున అభిమానులు నిరాశకు గురవుతారు అనే ఉద్దేశంతో ఒక ట్రైలర్ ని అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో విడుదల చేశారు సినిమా మేకర్స్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మరో ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. పాత ట్రైలర్ కంటే ఈ కొత్త ట్రైలర్ లో మరిన్ని డైలాగులు యాడ్ చేశారు. ఇక ఈ కొత్త ట్రైలర్ చూస్తే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమాను తీర్చిదిద్దినట్లు ఇట్టే అర్థమవుతోంది. ముఖ్యంగా పవన్-రానాల మధ్య సన్నివేశాలను నువ్వా-నేనా అన్నట్లు తీర్చిదిద్దారు. అలాగే నిత్య మీనన్ ను కూడా సినిమాలో ఒక ఫైర్ బ్రాండ్ లాగా చూపించారు. నాయక్ భార్య అంటే సగం కాదు.. డబుల్ అంటూ ఆమె ఫైర్ బ్రాండ్ లా కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్ ద్వారా యూట్యూబ్ పంచర్ కావడం ఖాయం అంటూ పంచ్ పేల్చారు తమన్.


Click it and Unblock the Notifications











