Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంచి టైమ్లో అలా కలిసొచ్చింది.. డబుల్ కంగ్రాట్స్: నితిన్పై అల్లు అర్జున్ కామెంట్స్
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం సూపర్ జోష్లో ఉన్నాడు. ఓ వైపు పెళ్లి సంబరాలు, మరోవైపు భీష్మ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ హుషారుగా ఉన్నాడు. ఈ తరుణంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నితిన్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. డబుల్ కంగ్రాట్స్ అంటూ నితిన్ ఉత్సాహాన్ని రెండింతలు చేశాడు.
తాజాగా ట్విట్టర్ వేదికగా సందేశం పోస్ట్ చేసిన అల్లు అర్జున్.. ''డబుల్ కంగ్రాచ్యులేషన్స్ నితిన్. ఇక నీ పెళ్లి వేడుకలు డబుల్ జోష్లో పూర్తిచేయబడతాయి. మంచి టైమ్ లో నీకు భీష్మ రూపంలో బాగా కలిసొచ్చింది. నీకు అంతా మంచే జరగాలి. 'భీష్మ' టీమ్ మొత్తానికి నా ప్రత్యేక అభినందనలు'' అని పేర్కొన్నాడు.
Double Congratulations @actor_nithiin . Now the wedding celebrations will happen with double josh. Best thing happened at the best time . Really happy for you . I Congratulate the entire Cast & Crew of #Bheeshma .
— Allu Arjun (@alluarjun) February 24, 2020
ఆ వెంటనే మరో ట్వీట్ పోస్ట్ చేసిన బన్నీ.. ''ఓ మంచి కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్టైనర్ను అందించినందుకు డైరెక్టర్ వెంకీకి కంగ్రాచ్యులేషన్స్. రష్మిక సూపర్, ఇక నా నిర్మాత వంశీకి ప్రత్యేక శుభాకాంక్షలు. 2020 జనవరి, ఫిబ్రవరి మీకు చాలా గొప్పది. మరోసారి ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్" అంటూ సందేశమిచ్చారు.
Congratulations to the Dir Venky Garu for the Commercial Emotional Entertainer , @iamRashmika for being an all rounder & my Producer Vamsi for the Raining success , 2020 Jan & Feb have been great for you . Congratulations to everyone once again .
— Allu Arjun (@alluarjun) February 24, 2020
'ఛలో' అంటూ సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ కుడుముల రెండో ప్రయత్నంలోనూ సక్సెస్ అయ్యాడు. ఆయన డైరెక్ట్ చేసిన 'భీష్మ' మూవీ క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. చిత్రంలో నితిన్ హీరోగా నటించగా ఆయన సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న ఆడిపాడింది. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయిందని తెలిసింది. ప్రస్తుతం 'భీష్మ' మూవీ విజయవంతంగా రన్ అవుతూ మంచి వసూళ్లు రాబడుతోంది.