Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగా హీరోల చుట్టూ తిరుగుతున్న నితిన్ డైరెక్టర్.. దసరా టార్గెట్!
సాధారణంగా ఏ దర్శకుడైనా సరే ఈ రోజుల్లో ఆలస్యంగా సినిమాలు చేయవద్దని డిసైడ్ అవుతున్నారు. కొత్తగా వచ్చే హీరోలు ఆలస్యం చేసినా కూడా దర్శకులు మాత్రం లేట్ చేయడం లేదు. ఎందుకంటే వీలైనంత తొందరగా మరొక సినిమాతో హిట్టు కోడితేనే ఇండస్ట్రీలో ఛాన్స్ ఉంటుంది. అయితే వరుసగా రెండు విజయాలు అందుకున్న కూడా దర్శకుడు వెంకీ కుడుముల స్లోగా వెళుతున్నాడు.
మొదటి సినిమా ఛలో ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ తరువాత నితిన్ తో చేసిన భీష్మ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. దీంతో బడా నిర్మాతల నుంచి మనోడికి ఆఫర్స్ చాలానే వచ్చాయి. త్రివిక్రమ్ కూడా మహేష్ సినిమా విషయంలో స్క్రిప్ట్ పరంగా సహాయకుడిగా సెట్ చేసుకున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ తో వెంకీకి ఒక కామిట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎంతమంది హీరోలకు కథ చెబుతున్నా కూడా సెట్టవ్వడం లేదట. వెంకీకి మహేష్, రామ్ చరణ్ వంటి స్టార్స్ తో వర్క్ చేయాలని ఉందట. కానీ ఆ హీరోలు ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు.
దీంతో భీష్మ దర్శకుడు మరో మెగా హీరోను ట్రై చేటున్నట్లు సమాచారం. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తో ఫిక్స్ అని అన్నారు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తో వర్క్ చేయవచ్చని కొత్త టాక్ వస్తోంది. కుదిరితే దసరా సందర్భంగా సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.