Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మెగా హీరోల చుట్టూ తిరుగుతున్న నితిన్ డైరెక్టర్.. దసరా టార్గెట్!
సాధారణంగా ఏ దర్శకుడైనా సరే ఈ రోజుల్లో ఆలస్యంగా సినిమాలు చేయవద్దని డిసైడ్ అవుతున్నారు. కొత్తగా వచ్చే హీరోలు ఆలస్యం చేసినా కూడా దర్శకులు మాత్రం లేట్ చేయడం లేదు. ఎందుకంటే వీలైనంత తొందరగా మరొక సినిమాతో హిట్టు కోడితేనే ఇండస్ట్రీలో ఛాన్స్ ఉంటుంది. అయితే వరుసగా రెండు విజయాలు అందుకున్న కూడా దర్శకుడు వెంకీ కుడుముల స్లోగా వెళుతున్నాడు.
మొదటి సినిమా ఛలో ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ తరువాత నితిన్ తో చేసిన భీష్మ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. దీంతో బడా నిర్మాతల నుంచి మనోడికి ఆఫర్స్ చాలానే వచ్చాయి. త్రివిక్రమ్ కూడా మహేష్ సినిమా విషయంలో స్క్రిప్ట్ పరంగా సహాయకుడిగా సెట్ చేసుకున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ తో వెంకీకి ఒక కామిట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎంతమంది హీరోలకు కథ చెబుతున్నా కూడా సెట్టవ్వడం లేదట. వెంకీకి మహేష్, రామ్ చరణ్ వంటి స్టార్స్ తో వర్క్ చేయాలని ఉందట. కానీ ఆ హీరోలు ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు.
దీంతో భీష్మ దర్శకుడు మరో మెగా హీరోను ట్రై చేటున్నట్లు సమాచారం. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తో ఫిక్స్ అని అన్నారు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తో వర్క్ చేయవచ్చని కొత్త టాక్ వస్తోంది. కుదిరితే దసరా సందర్భంగా సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.