Don't Miss!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎవరిని నమ్మవద్దు అంటూ సూసైడ్ చేసుకున్న మరో నటి.. ఫేస్ బుక్ లైవ్లోనే..
ముంబై నగరంలో వరుసగా సినీ నటుల ఆత్మహత్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒక ఘటన గురించి మరువక ముందే వరుసగా బాలీవుడ్ లో సినీ తారల మరణాలు అంధరిని షాక్ కి గురి చేస్తున్నాయి. సుశాంత్ మరణించిన తరువాత ఒక టీవీ యాక్టర్ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో నటి కూడా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చనిపోయిన ముందు రోజు ఆమె ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేసి బాధతో కొన్ని విషయాలను బయటపెట్టడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది.
కేవలం బాలీవుడ్ లోనే కాకుండా
మరో వారం గడిస్తే సుశాంత్ సింగ్ మరణించి రెండు నెలలు పూర్తవుతుంది. ఈ గ్యాప్ లోనే దేశవ్యాప్తంగా ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సూసైడ్ కేసులు నమోదయ్యాయి. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా అలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ఇక రీసెంట్ గా భోజ్ పురికి చెందిన ఒక నటి కూడా ఇండస్ట్రీలో మోసం కారణంగా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది.
40ఏళ్ళ మరో నటి సూసైడ్
వివరాల్లోకి వెళితే.. భోజ్ పూరిలో పలు సినిమాలతో అలాగే సీరియల్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పాథక్. 40 ఏళ్ళ అనుపమ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటోంది. అయితే రీసెంట్ గా ముంబైలోని తన నివాసంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను షాక్ కి గురి చేసింది.
తాను మోసపోయాను అంటూ
ఇక ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో సూసైడ్ నోట్ కూడా దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక అనుపమ సూసైడ్ చేసుకోవడానికి ఒక రోజు ముందు ఫేస్ బుక్ లైవ్ లో పలు కీలక విషయాలను తెలిపింది. చివరకు తాను మోసపోయాను అంటూ ఎవరిని కూడా నమ్మవద్దని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
Recommended Video
ఎవరిని నమ్మవద్దు
'అందరితో నమ్మకంగా ఉండడి. కానీ ఎవరిని మీరు నమ్మవద్దు. నా జీవితంలో నేను నేర్చుకున్న విషయం ఇదే. ఒక విజ్ డమ్ ప్రొడ్యూసర్ కంపెనీ సంస్థలో 10వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. మళ్ళీ ఆ తరువాత నాకు ఆ డబ్బులు రాలేవు' అని ఫేస్ బుక్ లో లైవ్ లో తెలిపింది. ఇక మనీష్ ఝా అనే వ్యక్తి తన దగ్గర తీసుకున్న ద్విచక్ర వాహనాన్ని తిరిగి ఇవ్వలేదని అనుపమ సూసైడ్ నోట్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.