Don't Miss!
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘ఖిలాడీ’ కోసం పోటీ పడుతోన్న ఓటీటీలు: రవితేజకు భారీ డీల్ ఇచ్చిన ప్రముఖ సంస్థ
ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో వచ్చిన 'క్రాక్'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. అప్పటి వరకు ఉన్న హిట్ల దాహాన్ని ఈ సినిమాతో తీర్చుకున్న అతడు.. కలెక్షన్ల పరంగానూ కెరీర్లోనే బెస్ట్ ఫిగర్లను అందుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో ఫుల్ స్వింగ్తో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు 'ఖిలాడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి భారీ ఆఫర్ వచ్చినట్లు ఓ న్యూస్ లీకైంది.
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న చిత్రమే 'ఖిలాడీ'. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. ఇప్పటి వరకూ తీసిన ఎపిసోడ్స్ అన్నీ సంతృప్తికరంగానే వచ్చాయట. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఖిలాడీ మూవీని నేరుగా రిలీజ్ చేసుకునేందుకు ఓ ప్రముఖ సంస్థ ఏకంగా రూ. 45 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే, చిత్ర యూనిట్ మాత్రం దీనికి నిరాకరించినట్లు సమాచారం.
రవితేజకు బయట మాస్ ఆడియెన్స్ నుంచి ఫాలోయింగ్ భీకరంగా ఉంటుంది. కాబట్టి.. ఈ సినిమాను ఆలస్యం అయినా థియేటర్లలోనే విడుదల చేయాలని చూస్తున్నట్లు, అందుకే ఓటీటీ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.