Don't Miss!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘మహాసముద్రం’ నుంచి బిగ్ అప్డేట్: అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్ ట్వీట్
తెలుగులో మల్టీస్టారర్ మూవీలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. ఆ తరహా చిత్రాలకు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడంతో దర్శక నిర్మాతలు కూడా అందుకు తగ్గట్లుగా కథలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారీ చిత్రాలతో పాటు చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'RX 100' సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయిన దర్శకుడు అజయ్ భూపతి 'మహాసముద్రం' అనే మల్టీస్టారర్ మూవీని రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమై ట్వీట్ చేశాడతను.
'RX 100' వంటి హిట్ సినిమాను తెరకెక్కించినా.. రెండో ప్రాజెక్టు విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. సుదీర్ఘ విరామం తర్వాత అతడు తన డ్రీమ్ ప్రాజెక్టు 'మహాసముద్రం'ను పట్టాలెక్కించేశాడు. వాస్తవానికి ఈ సినిమాలో నటించేందుకు గానూ ఎంతో మంది హీరోలకు కథను చెప్పినా.. వాళ్లెవరూ దీనికి పచ్చజెండా ఊపలేదు. కొందరు ఒప్పుకున్నా.. హోల్డ్లో పెట్టి ఉంచారు. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్లో దీన్ని తీస్తున్నాడు. ఇక, ఈ చిత్రంలో అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
#MahaSamudram 🌊 Shoot in Progress 🔥
— Ajay Bhupathi (@DirAjayBhupathi) January 1, 2021
All excited & awaiting to show you our Intense Action & Love Drama soon.
A BIG update on the way💥
Stay Tuned❤️ #HappyNewYear@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/mIaaCAmitk
ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన 'మహాసముద్రం' గురించి దర్శకుడు అజయ్ భూపతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ స్పాట్కు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసిన దర్శకుడు.. 'షూటింగ్ జరుగుతోంది. మా సున్నితమైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథను మీకు చూపించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాము. త్వరలోనే ఓ భారీ అప్డేట్తో రాబోతున్నాము. వేచి చూడండి' అంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.