Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హాట్హాట్గా బిగ్బాస్ భానుశ్రీ.. ఏడు చేపల కథ తర్వాత..
పక్కా శృంగారభరితమైన ఏడు చేపల కథ, బిగ్బాస్ ఫేం, భానుశ్రీ ప్రధానపాత్రలో దొంతు రమేష్ దర్శకుడిగా పరిచయమౌతూ తెరకెక్కిస్తున్న " ఈ అమ్మాయి " చిత్రం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయినిగమామంలో ప్రారంభమైంది.. శ్రీ అవధూత వెంకయ్య స్వామి ప్రోడక్షన్స్ బ్యానర్ పై దొంతు బుచ్చయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ముహుర్తపు సన్నివేశానికి నవ్యాంధ్రఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యస్.వి.ఎన్ రావు క్లాప్ నివ్వగా, పారిశ్రామికవేత్త చెరుకూరి సుధాకర్ రాజు స్విఛ్చాన్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఈ అమ్మాయి ప్రారంభోత్సవంలో
అనంతరం చిత్ర దర్శకుడు దొంతు రమేష్ మాట్లాడుతూ...ఈ అమ్మాయి చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ను ఈ నెల చివరి వారం నుంచి ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా టాకీ ని పూర్తి చేస్తామన్నారు అని అన్నారు.
ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం
జనవరి 23 న ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.. మిగత నటీనటులు ,టెక్నిషియన్ల ఎంపిక జరుగుతుందన్నారు. తర్వలోనే అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని దొంతు రమేష్ పేర్కొన్నారు.
అమ్మాయిల సమస్యలతో
చిత్ర నిర్మాత దొంతు బుచ్చయ్య మాట్లాడుతూ... వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కోనే రకరకాల సమస్యల్ని కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నామని అన్నారు.. ఈ సినిమా ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపోందిస్తామన్నారు.
ఏడు చేపల కథలో హాట్హాట్గా
ఇదిలా ఉండగా, బిగ్బాస్2 తర్వాత భానుశ్రీ క్రేజ్ పెరిగింది. ఏడు చేపల కథలో హాట్హాట్గా కనిపించింది. ఆ తర్వాత మరో హాట్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది భానుశ్రీ. ఈ సినిమాకు భానుశ్రీ క్రేజ్ మరింత హెల్ప్ అయ్యే అవకాశం లేకపోలేదు.
సాంకతిక నిపుణులు
బ్యానర్ : శ్రీ అవధూత వెంకయ్య స్వామి ప్రోడక్షన్స్ , మాటలు : అంజి సలాది, పాటలు : పించల్ దాస్ , కెమెరా : గువ్వాడ చంద్రమోహన్ , పి.ఆర్ ఓ : వై .రవికుమార్ , సహా నిర్మాత : గోగుల అనిల్ కుమార్ , నిర్మాత : దొంతు బుచ్చయ్య ,కథ, స్ర్కీన్ ప్లే ,దర్వకత్వం : దొంతు రమేష్