Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Bimbisara: శవాలపై కళ్యాణ్ రామ్ భయంకరమైన లుక్.. నిజంగానే షాక్ ఇచ్చాడుగా..
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా రెగ్యులర్ కథలను కాకుండా విభిన్నమైన అడుగులు వేయడానికి సిద్ధమయ్యాడు. సిరియాస్ లుక్స్ తో సినిమాలు చేస్తే కళ్యాణ్ రామ్ కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయగలడని అభిమానుల్లో ఎప్పటి నుంచో ఒక నమ్మకం ఉంది. ఇన్నాళ్లు అతనికి సరైన కథలు తగల్లేదు. కానీ ఇప్పుడు బింబిసర అనే హిస్టారికల్ కథతో హిట్ కొట్టేలా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
పవర్ఫుల్ హిట్ కొట్టడానికి
నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వారి స్థాయిని అంతకంతకు పెంచుకుంటున్నారు. ఇక కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈ రోజుల్లో ఎవరు చేయని ప్రయోగానికి సిద్ధమయ్యాడు. సోషియో ఫాంటసీ కథతో సిద్ధమవుతున్నట్లు ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చేశాడు.
శావలపై కళ్యాణ్ రామ్
బింబిసర అనే పాత్రలో కనిపించబోతున్నట్లు టైటిల్ తోనే క్లారిటి ఇచ్చేశారు. ఇదొక క్రీస్తుపూర్వం నాటి అతి భయంకరమైన రాజు కథ అని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ లుక్ చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతోంది. శావలపై మహారాజులా కూర్చొని ఉన్న లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటం అని ట్యాగ్ లైన్ ఇచ్చేశారు.
కొత్త దర్శకుడితో
సురేంధర్ రెడ్డి, అనిల్ రావిపూడి లాంటి టాలెంటేట్ దర్శకులకు మొదటి ఛాన్స్ ఇచ్చి తను కూడా మంచి విజయాలను అందుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు అదే తరహాలో విశిష్ట్ అనే మరో పవర్ఫుల్ దర్శకుడిని కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న బింబిసర సినిమాతో వశిష్ట్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ భారీ ప్రయోగమే చేస్తున్నాడు.
మూడు భాగాలుగా..?
నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ లోనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఆ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తారా లేక ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తారా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. పాన్ ఇండియా అనే రూమర్స్ వస్తున్నాయి కానీ అందులో కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. అయితే సినిమాను మాత్రం మూడు భాగాలుగా తేటకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.